Thursday, August 28, 2008

అన్నమయ్య సంకీర్తనల రాగి రేకులు ఎన్ని లభ్యమయ్యాయి?

తిరుమలలో స్వామి వారి హుండీ ఎదురుగా ఉన్న మంటపంలో తాళ్ళపాక వారి అర అనే గదిలో అన్నమయ్య సంకీర్తనల తామ్ర ఫలకాలు లభ్యమయ్యాయి. దీనినే సంకీర్తనా భాండాగారం అని అంటారు.




అన్నమయ్య సంకీర్తన రాగి రేకు











 సంకీర్తనా భాండాగారం.

ఇప్పటి వరకూ 2600 రాగి రేకులు సంకీర్తనా భాండాగారంలో లభించాయి. ఒక్కొక్క రేకుకి ఆరు సంకీర్తనల చొప్పున మొత్తం 15600 సంకీర్తనలు దొరికాయి.
అయితే ఇవి అన్నమయ్య రచించిన 32,000 కీర్తనలో సగం మాత్రమే.
మిగతా సగం ఏమైనట్టు?
అహోబిలం, శ్రీరంగం వంటి ప్రదేశాలలో కూడా వీటి ప్రతులు కొన్ని దొరుకుతున్నాయట. అక్కడ వాటి విలువ తెలియక కరిగించి రాగి పాత్రలు చేయించారట. తిరుమలలోనూ ఇలాగే జరిగి ఉంటుందని జనశృతి ఉంది.
బహుశా శత్రుదేశ దాడుల నుంచి ఈ సంకీర్తనలను కాపాడటానికి పెదతిరుమలయ్యా, చిన్నన్నలు ఈ రాగి రేకులని అలా దాచి పెట్టి ఉండవచ్చు. అలాగే ఒక్క చోటే కాక అహోబిలం, శ్రీరంగం వంటి ప్రదేశాలలోనూ దాచి ఉండవచ్చు.
ఏదేమైనా లభ్యం కాని అన్నమయ్య సంకీర్తనల గురించి ఇంకా పరిశోధనలు జరగాలి.

No comments: